గుర్తుతెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతి

Sep 20 2025 6:24 AM | Updated on Sep 20 2025 6:26 AM

నవీపేట్‌ మండలంలో..

ఖలీల్‌వాడి: నగరంలోని గంజ్‌ మార్కెట్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటవ టౌన్‌ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఈనెల 16న నగరంలోని గంజ్‌ మార్కెట్‌లోని కూరగాయల షాపు వద్ద గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అతడు మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 55–60ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. ఒంటిపై బూడిద రంగు బనియన్‌, క్రీమ్‌ కలర్‌ ప్యాంటు ఉన్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిసినచో వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఫోన్‌ నెంబర్‌ 8712659714ను సంప్రదించాలన్నారు.

నగరంలో..

ఖలీల్‌వాడి: నగరంలోని రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద గుర్తుపట్టలేని స్థితిలో వ్యక్తి మృతదేహం లభించిందని ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవన్నారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. ఈ వయస్సు ఉన్న వారు ఎవరైనా తప్పిపోయినచో ఒకటో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఫోన్‌ నెంబర్‌ 8712659837, 8712659714కు సమాచారం అందించాలన్నారు.

నవీపేట: మండలంలోని నాగేపూర్‌ శివారులో శుక్రవారం ఉదయం ప్లాస్టిక్‌ సంచిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవన్నారు. మృతుడి వయస్సు సుమారు 30–40 ఏళ్లలోపు ఉంటుందన్నారు. దుండగులు హత్య చేసి ప్లాస్టిక్‌ సంచిలో మూట కట్టినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం పూర్తిగా కూలిపోయి ఉందని, మృతదేహంపై నలుపు రంగు ప్యాంటు, ఎరుపు రంగు టీషర్టు ఉందన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామన్నారు.

న్యాయం చేయాలంటూ

పురుగుల మందు డబ్బాతో ఆందోళన

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఓ మాజీ కౌన్సిలర్‌ ఇంటి ముందు శుక్రవారం బాధితుడు మహదేవ్‌ న్యాయం చేయాలంటూ పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేశారు. బాధితుడు మాట్లాడుతూ.. పాల్వంచ మండలం భవానిపేట గ్రామంలోని సర్వేనెంబర్‌ 769/186లో ఐదు ఎకరాల 10 గుంటల భూమిని మాజీ కౌన్సిలర్‌ భర్త వద్ద రూ. 70లక్షలకు కొనుగోలు చేయగా, సేల్‌ డీడీ చేసి ఇచ్చారన్నారు. కానీ తన పేరుపైన పాస్‌ పుస్తకం చేసి ఇస్తానని చెప్పి రెండు సంవత్సరాలు అవుతుందని, అడిగితే భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు.

నల్లబెల్లం, పటిక పట్టివేత

ఖలీల్‌వాడి: గుడుంబా తయారీకి ఉపయోగించే నిషేధిత నల్లబెల్లం, పటికను పట్టుకున్నట్లు ఆర్‌పీఎఫ్‌ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. ఆపరేషన్‌ సత్కార్‌ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గురువారం రాత్రి నాందేడ్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలులో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో 2వేల కిలోల నల్లబెల్లం, 200 కిలోల పటికను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నల్ల బెల్లం విలువ రూ. 8లక్షలు, 200కిలోల పట్టిక రూ. 40 వేలు ఉంటుందన్నారు. పట్టుకున్న నల్ల బెల్లం, పటికను నిజామాబాద్‌ ఎకై ్సజ్‌ అధికారులకు అప్పగించామన్నారు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి, ఎకై ్సజ్‌ అధికారులు ఉన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి
1
1/1

గుర్తుతెలియని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement