
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
● జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు
● ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో
భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు
భిక్కనూరు/సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తంచేశారు. భిక్కనూరులోని పద్మశాలి కల్యాణ మండపంలో ఆదివారం భిక్కనూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. భిక్కనూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల 1989–90 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు పెద్దమల్లారెడ్డిలోని వీరభద్ర ఫంక్షన్హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అలాగే సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ ఉన్నత పాఠశాల 2001–02 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు సైతం సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు

ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు