
దాది రతన్ మోహిని సేవలు ప్రశంసనీయం
కామారెడ్డి అర్బన్: బ్రహ్మకుమారి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దాది రతన్ మోహిని సేవలు ప్రశంసనీయమని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఇన్చార్జి జయ దిదీ అన్నారు. ఆదివారం కామారెడ్డి ఓంశాంతి కేంద్రంలో రతన్ మోహిని దాది చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు గంగలత, కవిత, లలిత, చంద్రకళ, అనిల్కుమార్, జిల్లాలోని ఆయా గ్రామాల ఓంశాంతి కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నేలకూలిన చెట్లు
బీబీపేట: గత రెండు రోజుల క్రితం వీచిన ఈదురు గాలులు, వడగళ్ల వర్షాలకు నేలకూలిన చెట్లను అధికారులు నామమాత్రంగా తొలగించి చేతులు దులుపుకుంటున్నారు. బీబీపేట నుండి తుజాల్పూర్ ప్రదాన రహదారిలో సుమారుగా ఆరు చెట్లు నేలకూలగా అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. రోడ్లపై సగం వరకు అలాగే చెట్లు ఉండడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాల గోల్మాల్
నస్రుల్లాబాద్: మండలంలోని అంకోల్ గ్రామంలో ఐకేపీ వారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు గోల్మాల్ జరిగినట్లు బాధిత రైతు వాపోతున్నారు. ఈ నెల 16న అంకోల్ గ్రామానికి చెందిన సంతోష్రెడ్డి అనే రైతు ఐకేపీ అధికారులకు 281 సంచులను తూకం చేసి ఇచ్చాడు. ప్రస్తుతం 240 సంచులు మాత్రమే తనయంటు అధికారులు తెలుపుతున్నారని, 40 సంచుల వరకు తేడా వచ్చిందని తనకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు. ఈ విషయమై ఏపీఎం గంగాధర్ను వివరణ కోరగా గ్రామంలో పూర్తి విచారణ చేపట్టి ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుంటామని అన్నారు.

దాది రతన్ మోహిని సేవలు ప్రశంసనీయం