
విద్యుదాఘాతంతో మరొకరు..
పెద్దకొడప్గల్: పనిచేస్తున్న ప్రాంతంలో వెలగని బల్బును సరిచేస్తున్న ఓ వ్యక్తికి విద్యుదాఘాతం సంభవించి మృతి చెందిన ఘటన పెద్దకొడప్గల్ మండలం జగన్నాథ్పల్లి తండా శివారులో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నాందేడ్కు చెందిన గజానన్(25) తండా శివారులోని ఇటుక బట్టీలో ఐదు నెలలుగా కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం వేకువ జామున పనిచేస్తున్న ప్రదేశంలో వెలగని బల్బును సరిచేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి కిందపడిపోయాడు. గమనించిన తోటి కూలీలు బాన్సువాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.