13న గురుకులాల్లో ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

13న గురుకులాల్లో ప్రవేశ పరీక్ష

Apr 9 2025 12:11 AM | Updated on Apr 9 2025 12:11 AM

13న గ

13న గురుకులాల్లో ప్రవేశ పరీక్ష

పిఠాపురం: ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాలలో 2025–26 విద్యా సంత్సరానికి 5వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 13వ తేదీన నిర్వహించనున్నట్లు పిఠాపురం అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ త్రివేణి తెలిపారు. ఈమేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్‌ 13వ తేదీ ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 5వ తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్‌ టికెట్‌లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీబీఆర్‌ఏజీసీఈటీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌,ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చన్నారు. హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు (ఆధార్‌ కార్డు)తో పరీక్షకు హాజరు కావాలని ఆమె కోరారు.

నేడు రాష్ట్ర స్థాయి

మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌

కాకినాడ రూరల్‌: తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్‌ వద్ద నన్నయ్య ఎంఎస్‌ఎన్‌ పీజీ సెంటరులో కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం ఆధ్వర్యంలో తలాష్‌ – 2కె 25 పేరిట రాష్ట్రస్థాయి మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌ను బుధవారం నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్‌ ప్రశాంతి శ్రీ తెలియజేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నన్నయ్య యూనివర్శిటీ వీసీ ప్రసన్న శ్రీ,, ఓఎన్‌జీసీ ఈడీ రత్నేష్‌కుమార్‌ హాజరవుతారన్నారు.

సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు

అన్నవరం: సత్యదేవునికి చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా అర్చకులు మంగళవారం స్వామి, అమ్మవార్లకు ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం తొమిది గంటల నుంచి 11 గంటల వరకు తులసి దళార్చన నిర్వహించారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు వేయి నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 20 లక్షల ఆదాయం సమకూరింది.

ఘనంగా సీతారాముల వేద సదస్యం

కాగా, రత్నగిరి రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సీతారాముల వేద సదస్యం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు నవదంపతులు సీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారిని మరో ఆసనంపై ఉంచి పూజలు చేశారు. సీతారాములకు నూతన పట్టు వస్త్రాలను ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు అందజేశారు. వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠీ, చిట్టి శివ, గంగబాబు, రామాలయ అర్చకుడు దేవులపల్లి ప్రసాద్‌, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభి కార్యక్రమం నిర్వహించారు.

సింగిల్‌ నంబర్‌ లాటరీ

స్థావరాలపై దాడులు

కాకినాడ క్రైం: కాకినాడలో కూటమి నేతల అండదండలతో విచ్చలవిడిగా లక్షల్లో జరుగుతున్న నంబర్‌గేమ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బెంగళూరు కేంద్రంగా చేసుకుని దినసరి కూలీలు, నిరుపేదల జీవితాలతో చెలగాటమాటమాడుతున్న సింగిల్‌ నంబర్‌ లాటరీల భాగోతాన్ని గత నెల 20న ‘కూటమి వారి లాటరీ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై జిల్లా ఎస్పీ బిందుమాధవరావు తీవ్రంగా స్పందించి ఆకస్మికంగా దాడులు చేయించారు. కాకినాడ సాంబమూర్తినగర్‌ ఫ్‌లై ఓవర్‌, సంజయ్‌నగర్‌ లారీ ఆఫీసు, ఎమ్‌ఎస్‌ఎన్‌ చారిటీస్‌ నూకాలమ్మ గుడి వద్ద పార్కు తదితర ప్రాంతాల్లో నిత్యం సింగిల్‌ నంబర్‌ లాటరీతో పేదల పొట్టగొడుతున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ సింగిల్‌ నంబర్‌ లాటరీ స్థావరాలపై ప్రత్యేక పోలీసు బృందాలతో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కాకినాడ టూటౌన్‌, త్రీటౌన్‌ పరిధిలో పలు సింగిల్‌ నంబర్‌ లాటరీ స్థావరాలను పోలీసులు గుర్తించారు. నంబర్‌ గేమ్‌ ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదును, మొబైల్‌ఫోన్‌లను స్వాఽధీనం చేసుకున్నారు. నంబర్‌ గేమ్‌కు మూలాలు, పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్నాయని తెలియడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

వేద సదస్యం నిర్వహిస్తున్న పండితులు

13న గురుకులాల్లో  ప్రవేశ పరీక్ష 
1
1/1

13న గురుకులాల్లో ప్రవేశ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement