కమనీయం.. రాములోరి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. రాములోరి కల్యాణం

Oct 15 2025 6:22 AM | Updated on Oct 15 2025 6:22 AM

కమనీయం.. రాములోరి కల్యాణం

కమనీయం.. రాములోరి కల్యాణం

ఎర్రవల్లి: శ్రీరాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణం జరిపించారు. భక్తులు సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకించి తన్మయం పొందారు. అనంతరం ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్‌ సురేందర్‌రాజు, అర్చకులు భువనచంద్ర, దత్తుస్వామి, భానుమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement