
రాజీ మార్గంతో సమయం ఆదా
గద్వాల క్రైం/అలంపూర్: రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవడంతో సమయం ఆదా అవుతుందని జిల్లా న్యాయమూర్తి ఎన్.ప్రేమలత, అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్తేజ అన్నారు. శనివారం గద్వాలలో జరిగిన జాతీయ లోక్అదాలత్లో 8195 కేసులు, అలంపూర్ జూనియర్ సివిల్ కోర్టులో 3701 కేసులు పరిష్కరించారు. క్రిమినల్, సివిల్, సైబర్ క్రైం, బ్యాంకు లిటిగేషన్, ప్రమాద తదితర పెండింగ్ కేసుల్లో ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చినట్లు జిల్లా న్యాయమూర్తి ప్రేమలత తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు టి. లక్ష్మీ, వెంకట హైమ పూజిత, ఏపీపీలు రెచ్చల్ సంజాన జాషువ, జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రెటరీ శ్రీనివాస్, న్యాయవాదులు తదితరులు ఉన్నారు.
● కోర్టులో కేసులు నడుస్తున్నా రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని జడ్జి మిథున్ తేజ అన్నారు. రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవడం వలన కక్షిదారులకు ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడి దూరం అవుతుందన్నారు. క్షక్షిదారులు లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలంపూర్ లోక్ అదాలత్లో సివిల్కు సంబంధించి ఒక కేసు, క్రిమినల్ కేసులు–31, ఎస్టీసీ కేసులు 3701 పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, సీనియర్ న్యాయ వాదులు నారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కరుణాకర్ రావు, సీఐ టాటబాబు, ఏపీపీ, ఏజీపీ, ఎస్ఐలు, కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు.
గద్వాల, అలంపూర్ లోక్ అదాలత్లో 11,896 కేసులు పరిష్కారం