పది ఫలితాల్లో కొంత మెరుగు | - | Sakshi
Sakshi News home page

పది ఫలితాల్లో కొంత మెరుగు

May 1 2025 1:27 AM | Updated on May 1 2025 1:27 AM

పది ఫ

పది ఫలితాల్లో కొంత మెరుగు

32 నుంచి 26వ స్థానానికి చేరిన జిల్లా స్థానం

91.74 శాతం ఉత్తీర్ణత

బాలికలదే పైచేయి..

బాలికలు 93.96 శాతం, బాలురు 89.49 శాతం ఉత్తీర్ణత

గద్వాలటౌన్‌: పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 26వ స్థానంతో సరిపెట్టుకోవడం తీవ్ర నిరాశ కల్గించింది. గతంతో పోలిస్తే జిల్లా ర్యాంకు, ఉత్తీర్ణత శాతం కొంత మెరుగుపడింది. గత ఏడాది రాష్ట్రస్థాయిలో 32వ స్థానంలో ఉన్న జిల్లా ర్యాంకు ఈ సారి కాస్త పెరిగింది. ఉత్తీర్ణత ఏకంగా పది శాతానికి పైగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 7,569 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 6,944 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లా సరాసరి ఉత్తీర్ణత 91.74 శాతంగా నమోదైంది. వీరిలో 3,759 మంది బాలురకు గాను 3,364 మంది ఉత్తీర్ణత సాధించి 89.49 శాతంతో సరిపెట్టుకున్నారు. 3,810 మంది బాలికలు పరీక్షలు రాయగా 3,580 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 93.96 శాతంతో బాలుర కంటే కొంత పైచేయి సాధించారు. అక్షరాస్యతలో వెనకంజలో ఉన్న ఈ జిల్లాలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధించినప్పటికీ సర్దుబాటుతో వాటిని భర్తీ చేయగలిగారు.

61 పాఠశాలలకు ‘వంద’నాలు

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి. అయితే అందులో 61 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలిచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వంద శాతం ఉత్తీర్ణత రావడం జిల్లాకే గర్వకారణం. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన వాటిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఒకటి, జడ్పీ ఉన్నత పాఠశాలలు 17, రెసిడెన్షియల్‌ పాఠశాలలు 08, కేజీబీవీలు 05, ప్రైవేటు పాఠశాలలు 30 ఉన్నాయి. మరి కొన్ని పాఠశాలలు ఒకటి, రెండు శాతంతో వందశాతం ఉత్తీర్ణత కోల్పోయాయి.

ప్రతిభ చాటిన విద్యార్థులు..

● గద్వాల విశ్వభారతి హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని అఫ్రానాజ్‌ 587 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. అయిజ శ్రీకృష్ణవేణి హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని పద్మావతి 585 మార్కులు సాధించి జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో గట్టు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని అక్షయ 576 మార్కులు, కేటీదొడ్డి బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి చరణ్‌ 574 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు.

● జిల్లాలో 962 మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు.

సమష్టి కృషికి నిదర్శనం

పదో తరగతి ఫలితాలలో జిల్లా విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఈ సారి 10.36 శాతం ఉత్తీర్ణత మెరుగుపడింది. అందరి సమష్టి కృషి ఫలితంగానే 91 శాతంకు పైగా ఉత్తీర్ణత వచ్చింది. వంద రోజుల ప్రణాళిక, ప్రత్యేక తరగతులను ప్రతి పాఠశాలలో త్రికరణశుద్ధిగా అమలు చేయడంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ఇకపై ఇదే ఒరవడి కొనసాగించి, రాబోవు విద్యా సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జిల్లా అధికారులకు అభినందనలు.

– సంతోష్‌, కలెక్టర్‌

సివిల్స్‌ సాధించడమే లక్ష్యం

తల్లిదండ్రులు యూనిస్‌పాష (యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు), అమ్మ ఆసిమాబేగం, గురువుల ప్రోత్సహంతో మంచి మార్కులు సాధించాను. 587 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉంది. ఐఐటీలో సీటు సంపాదించి, సివిల్స్‌ సాధించడమే నా లక్ష్యం.

– అఫ్రానాజ్‌, విశ్వభారతి హైస్కూల్‌, గద్వాల

జిల్లాలో గతంలో పదో తరగతి ఫలితాలు ఇలా..

డాక్టర్‌ అవుతా..

ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహం, కష్టపడి చదవడంతో 566 మార్కులు సాధించాను. తల్లిదండ్రులు శివశంకర్‌, లలిత కష్టం వృథా కాకుండా మంచి మార్కులు సాధించా. వైద్యురాలిగా స్థిరపడి పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడమే నా లక్ష్యం.

– అక్షయ, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, గద్వాల

పది ఫలితాల్లో కొంత మెరుగు 1
1/3

పది ఫలితాల్లో కొంత మెరుగు

పది ఫలితాల్లో కొంత మెరుగు 2
2/3

పది ఫలితాల్లో కొంత మెరుగు

పది ఫలితాల్లో కొంత మెరుగు 3
3/3

పది ఫలితాల్లో కొంత మెరుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement