ఈదురుగాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

Apr 28 2025 12:27 AM | Updated on Apr 28 2025 12:27 AM

ఈదురు

ఈదురుగాలుల బీభత్సం

ధరూరు: మండలంలో భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు భారీ ఎత్తున ఈదురు గాలులు వీచడంతో చెట్లు నేలకొరిగాయి. గార్లపాడు గ్రామానికి చెందిన పాలెం నర్సింహులుకు చెందిన రెండు కాడెద్దులు పిడుగు పాటుకు గురై మృతి చెందాయి. వీటి విలువ 1.50లక్షలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. మండల కేంద్రంతో పాటు మండల పరిదిలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది.అలాగే, ధరూరులో ఇటీవల నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లతో లోతట్టు ప్రాంతాల్లోని ముస్లిం కాలనీ, ఎస్సీ కాలనీల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. సాయంత్రం నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

మసీదుపై పిడుగు.. తప్పిన ప్రమాదం

ఎర్రవల్లి: పిడుగుపాటు మజీద్‌ మినార్‌ కూలిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని దువాసిపల్లిలో సాయంత్రం భారీ ఉరుములతో కూడిన ఈదురు గాలులు వీచడంతో ఒక్కసారిగా గ్రామంలోని మసీద్‌పై పిడుగు పడింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగు దాటికి మసీద్‌ మినార్‌ (శిఖరం) పాక్షికంగా కూలిపోయింది. గ్రామంలో పక్షం రోజుల్లోనే రెండవసారి పిడుగు పడటంతో ప్రజలంతా భయబ్రాంతులకు గురయ్యారు.

ధరూరులో విరిగిన చెట్లు,

నిలిచిన విద్యుత్‌ సరఫరా

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యం

ఈదురుగాలుల బీభత్సం 1
1/3

ఈదురుగాలుల బీభత్సం

ఈదురుగాలుల బీభత్సం 2
2/3

ఈదురుగాలుల బీభత్సం

ఈదురుగాలుల బీభత్సం 3
3/3

ఈదురుగాలుల బీభత్సం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement