● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
పలిమెల: శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం పలిమెల పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురో గతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరి శుభ్రతను పరిశీలించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ కేసుల దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరి ష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజ లకు నాణ్యమైన పోలీస్సేవలు అందించేలా పనిచేయా లని సిబ్బందిని ఆదేశించారు.ఈకార్యక్రమంలో పలి మెల ఎస్సై సాయిశశాంక్, సిబ్బంది పాల్గొన్నారు.


