రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల వయోపరిమితి పెంచడం సంతోషమే. అయితే ఒక ఏడాదికే జీఓను పరిమితం చేయడం సరికాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల అన్నింటిని గుర్తించి అన్ని నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పట్టభద్రులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారి లక్ష్యం నెరవేరాలంటే భారీ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటుతోంది..ఇంకా జాప్యం చేయొద్దు.
–మనుబోతుల మల్లయ్య,
ఎంఎస్సీ, బీఈడీ, నెక్కొండ


