
గ్రామస్థాయిలోనే మేలైన విత్తనాలు
రేగొండ: నాణ్యమైన విత్తనాలు గ్రామస్థాయిలోనే లభిస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. బుధవారం కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్లో వరి, పెసర పంటల క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలే రైతులకు నిజమైన నేస్తాలన్నారు. రైతులు పండించిన నాణ్యమైన విత్తనాలు గ్రామస్థాయిలోనే ఇతరులకు ఇవ్వడం ద్వారా కల్తీ విత్తనాల బారిన పడకుండా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ శాస్త్రవేత్తల బృందం హరి, వెంకట రాజుకుమార్, ఓంప్రకాష్, ప్రశాంత్, కొత్తపల్లిగోరి మండల వ్యవసాయాధికారి సారయ్య, ఏఈఓ ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు.