
భూమి అమ్మి చదివించారు..
నల్లబెల్లి: చదువు ఒక్కటే తరగని ఆస్తి అని బలంగా నమ్మారు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన ఈర్ల రవీందర్. కూలీ చేసి కొనుక్కున్న 4 ఎకరాల భూమిని కుమారుడు ప్రశాంత్ చదువు కోసం అమ్మేశారు. తండ్రి కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రశాంత్ ఇష్టంగా చదివారు. ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ విభాగంలో పని చేస్తున్నారు. ‘నాకోసం భూమి అమ్మి కుటుంబ పోషణ కోసం నాన్న 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. నాన్న ప్రోత్సాహమే నన్ను వైద్యుడిని చేసింది. నా విజయం నాన్నకు అంకితం’ అంటున్నారు ప్రశాంత్.

భూమి అమ్మి చదివించారు..