
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
రేగొండ: తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడు మృతిచెందిన ఘటన మండలంలోని రామన్నగూడెంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నగూడెం గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాములు (55) కుల వృత్తిలో భాగంగా శుక్రవారం సాయంత్రం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు నడుముకు ఉన్న మోకు జారడంతో రాములు తాటిచెట్టుపై నుంచి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్కుమార్ తెలిపారు. మృతుడికి భార్య రమ, కూతురు, కొడుకు ఉన్నాడు.