
ఫీజు రాయితీ కల్పించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్ట్ల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ.. గురువారం టీఎస్జేయూ నాయకులు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఫీజు రాయితీ కల్పించే విధంగా సర్క్యూలర్ జారీ చేయాలని కోరారు. దీంతో స్పందించిన డీఈఓ రాయితీ కల్పించేలా ఆదేశాలిస్తూ ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజషన్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్, నాయకులు రవీందర్, రవి, భూపాల్, సతీష్, చంద్రమౌళి, జగన్ పాల్గొన్నారు.