అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Jun 9 2025 7:03 AM | Updated on Jun 9 2025 7:03 AM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రేగొండ: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు విడుతల వారీగా మంజూరుచేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని దామరంచపల్లి, విజ్ఙయ్యపల్లి, రాజక్కపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆదివారం మంజూరు పత్రాలు అందజేశారు. దామరంచపల్లిలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా అర్హులందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసనం లేదన్నారు. పారదర్శకంగా ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌ డీఈ రవికుమార్‌, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ రాంప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శులు దుర్గాభవాని, స్వప్న, కాంగ్రెస్‌ జిల్లా, మండల నాయకులు సూదనబోయిన ఓంప్రకాశ్‌, మొట్టే కిరణ్‌, బండారి దేవేందర్‌, వీరబ్రహ్మం, రవిసామ్రాట్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, మధుసూదన్‌, మెండయ్య పాల్గొన్నారు.

రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో..

రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. కొత్తపల్లిగోరి మండలంలోని సుల్తాన్‌పూర్‌ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్ర త్యేక పూజలు చేశారు. అనంతరం జగ్గయ్యపేట పాఠశాలకు సంబంధించిన బడిబాట కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement