
బిల్లులు వెంటనే చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులు వెంటనే చెల్లించాలని కార్మికులు సోమవారం అదనపు కలెక్టర్ అశోక్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ మాట్లాడారు. జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులకు నాలుగు నెలలుగా వంట బిల్లులు ఇవ్వలేదన్నారు. వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని కోరారు. కోడిగుడ్లు, అల్పాహార బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమవుతున్న తరుణంలో మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు వరలక్ష్మి, ఉమాదేవి, బెల్లంకొండ స్వప్న, సంబడి చంద్రక్క, వేముల రాజేశ్వరి, సమత, సరోజన, కళావతి, మమత, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.