దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు

Jun 10 2025 3:22 AM | Updated on Jun 10 2025 3:22 AM

దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు

దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు

భూపాలపల్లి: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. 22 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మీ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement