
నాసిరకం విత్తనాలతో మోసపోవద్దు
కాటారం : రైతులు విత్తనాల ఎంపికలో నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయాలని, నాసిరకం విత్తనాలు కొని మోసపోవద్దని డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి సూచించారు. కాటారం మండలం ప్రతాపగిరిలో శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులతో కలిసి రైతులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ సాగుకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వినియోగం, పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. తక్కువ ధరకు లభించే లూజ్ విత్తనాలు, నాసిరకం విత్తనాలు కొనుగోలు చేయొద్దని రైతులకు సూచించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే టప్పుడు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలకు తావొవ్వద్దన్నారు. అనుమానితులు ఎవరైనా గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మ్యాక అభిన వ్, ఏఈఓ రాజన్న, రైతులు పాల్గొన్నారు.
డీఎస్పీ రామ్మోహన్రెడ్డి