భూపాలపల్లి రూరల్: విదేశీ విశ్వవిద్యాలయాలలో పోస్టు గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసిస్తూ స్కాలర్షిప్ పొందడం కోసం అర్హత కలిగిన ముస్లిం, క్రిష్టియన్, సిక్కు, బౌద్ధ, పార్శి జైనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 1వతేదీ నుంచి ప్రవేశం పొందిన విద్యార్థులు వెబ్సైట్ద్వారా ఆన్లైన్లో ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
లారీడ్రైవర్పై
గొడ్డలితో దాడి
భూపాలపల్లి రూరల్: జిల్లాకేంద్రంలోని లారీ మెకానిక్షెడ్లో లారీ డ్రైవర్పై దొంగ గొడ్డలితో దాడిచేసి గాయపరిచిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు డ్రైవర్ కల్యాణ్, స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి షెడ్లోని లారీ బ్యాటరీని గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించేందుకు ప్రయత్నాలు చేశాడు. పక్కనే ఉన్న డ్రైవర్ కల్యాణ్ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో దొంగ గొడ్డలితో దాడికి పాల్పడి పారిపోయాడు. కల్యాణ్కు తలపై తీవ్రంగా గాయం కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేష్కుమార్ తెలిపారు.
కొలతల ప్రకారం
కూలీలు పనిచేయాలి
● డీఆర్డీఓ బాలకృష్ణ
చిట్యాల/మొగుళ్లపల్లి: ఉపాధి హామీ పనిచేసే కూలీలు కొలతల ప్రకారం చేయాలని డీఆర్డీఓ పోరిక బాలకృష్ణ అన్నారు. బుధవారం చిట్యాల మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలకు సమావేశం నిర్వహించారు. మొగుళ్లపల్లి మండలం గణేష్పల్లి గ్రామంలోని పెద్ద చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ కూలీలకు పని ప్రదేశంలో నీడ, ప్రథమ చికిత్స బాక్స్, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. వనమహోత్సవ కార్యక్రమంలో టార్గెట్ ప్రకారం మొక్కలను నాటించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్నకారు రైతులకు పండ్ల తోటల కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓలు జయశ్రీ, సుభాష్ చంద్రబోస్, క్వాలిటీ కంట్రోల్ ధర్మసింగ్, ఏపీఓలు హలీం పాషా, టీఏలు పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ..