అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Jun 5 2025 7:32 AM | Updated on Jun 5 2025 7:32 AM

అప్రమ

అప్రమత్తంగా ఉండాలి

టేకుమట్ల: సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ మధుసూదన్‌ అన్నారు. బుధవారం మండలంలోని వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో పలు రిజిస్టర్లు పరిశీలించారు. మండలంలోని గర్మిళ్లపల్లి, టేకుమట్ల, వెలిశాలలో ఇటీవల నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతనే ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ దొమ్మటి ప్రియాంక, హెల్త్‌ సూపర్‌వైజర్‌ విజయ, ఫార్మసిస్టు విద్యాసాగర్‌, స్టాప్‌ నర్సు చిత్ర, ఏఎన్‌ఎం సంగీత, మంజుల, కంప్యూటర్‌ ఆపరేటర్‌ రమేష్‌, సిబ్బంది ఉన్నారు.

పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మధుసూదన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించి సిబ్బంది సమయ పా లన పాటించాలని సూచించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రతీ శు క్రవారం డ్రైడే సర్వే చేయాలని ఆదేశించారు. మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలన్నారు. అనంతరం రంగాపురం, పిడిసిల్ల, మొట్లపల్లి గ్రామాల్లోని నూ తన సబ్‌ సెంటర్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ నాగరాణి, డా క్టర్‌ నవత ఏఎన్‌ఎంలు వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి 1
1/1

అప్రమత్తంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement