టేకు కలప స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

టేకు కలప స్వాధీనం

May 30 2025 12:57 AM | Updated on May 30 2025 12:57 AM

టేకు కలప స్వాధీనం

టేకు కలప స్వాధీనం

వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను గురువారం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి వంశీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి వెంకటాపురం మండల మీదుగా అక్రమంగా రెండు వాహనాల్లో టేకు దిమ్మలను తరలిస్తున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆలుబాక గ్రామ సమీపంలో రెండు బొలెరో వాహనాల్లో తరలిస్తున్న 17 టేకు దిమ్మలను పట్టుకున్నట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని వెంకటాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు వెల్లడించారు. వీటి విలువ రూ.6.5లక్షలు ఉంటుందని వివరించారు. ఈ దాడుల్లో ఆలుబాక సెక్షన్‌ అధికారి చంద్రమోహన్‌, ఎదిర సెక్షన్‌ ఆఫీసర్‌ జయసింగ్‌, సిబ్బంది ప్రణవి, లాలు, బెస్‌ క్యాంప్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement