● డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు
జనగామ రూరల్: ఆహార భద్రతపై అవగాహన తప్పనిసరి అని డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రతపై ప్రత్యేక దినోత్సవం సందర్భంగా పాఠశాల వసతి గృహాల వార్డెన్లు, వంటశాల సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ వినీల్ కుమార్, ఏబీసీడీఓ రవీందర్, ట్రైనర్ వేణుగోపాల కృష్ణ, కుక్ లు, వార్డెన్లు, వంటశాల సిబ్బంది పాల్గొన్నారు.


