రాయికల్: జిల్లాకు ఎస్సారెస్పీ వరప్రదాయిని. ఇక్కడి భూములన్నీ
ప్రధాన కాలువతోపాటు డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా సాగవుతాయి. కొడిమ్యాల, మల్యాల వంటి నాన్ ఆయకట్టు ప్రాంతాలకు నీరందకున్నా.. దాదాపు ఆయకట్టు రైతులందరికీ ఎస్సారెస్పీ నీరే ఆధారం. కానీ.. ఆయకట్టు మండలమైన రాయికల్ మండలం రాజనగర్కు మాత్రం ఎస్సారెస్పీ నీరు చేరడం లేదు. ఫలితంగా రైతులు లక్షలాది రూపాయలు అప్పు చేసి బావులు తవ్వించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బావుల్లో లభించే నీటి ద్వారానే పంటలు సాగు
చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


