ఈసారి పురుగులు, తెగుళ్లతో కాయలపై మంగు(నల్లని మచ్చలు) వస్తున్నాయి. ఆ కాయలను ఎవరూ కొనడం లేదు. ఢిల్లీ వ్యాపారులు కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రేట్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కిలో రూ.30 నుంచి రూ.35 మధ్యనే ఉంటున్నాయి. – ఎండీ.మోయిన్,
వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, జగిత్యాల
పెద్దకాయలు రావడం లేదు
ఈ ఏడాది వాతావరణ మార్పులతో మామిడికాయలు పెద్దగా మార్కెట్కు రావడం లేదు. గతంలో జిల్లా నుంచి కనీసం 40 నుంచి 50లారీలు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తే ఇప్పుడు 10 నుంచి15కు మించడం లేదు. గల్ఫ్దేశాలకు ఎగుమతి లేకపోవడంతో ధరల మందగించాయి.
– ప్రకాశ్, జిల్లా మార్కెటింగ్ అధికారి


