ధర్మపురి: సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశోకతీర్థ స్వామీ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని జైనాలోగల సీతారామకల్యాణ మండపంలో ఆదివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విశోకతీర్థ స్వామిజీ, జిల్లా సంఘచాలక్ ఆకుతోట శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. సనాతన ధర్మం ద్వారా ప్రపంచశాంతి జరుగుతుందని అన్నారు. చిన్నారుల నాట్యప్రదర్శనలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. సర్పంచ్లు గడ్డి లక్ష్మి, రమాదేవి, పత్తి ప్రభాకర్ మహిళ వక్త రజిత ఉన్నారు.


