‘బీఆర్ఎస్ నాయకుల కమీషన్ల కక్కుర్తి’
మేడిపెల్లి(వేములవాడ): కమీషన్ల కోసమే బీఆ ర్ఎస్ నాయకులు ఆభివృద్ధి పనులు అడ్డుకుంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోరపెల్లి సత్యనారాయణ ఆరోపించారు. వారి తీరును నిరసిస్తూ నిజామాబాద్ – జగిత్యాల జాతీయ రహదారిపై సోమవారం ధర్నా చేశారు. ఆ యన మాట్లాడుతూ, మేడిపెల్లి – గోవిందారం వరకు డబుల్ రోడ్డు పనుల కోసం ఎంపీ బండి సంజయ్ రూ.20కోట్లు మంజూరు చేశారని, అయితే, కమీషన్లు ఇవ్వడం లేదనే సాకుతో బీఆర్ఎస్ నాయకులు నాలుగు నెలలుగా పనులు అడ్డుకుంటున్నారన్నారు. తక్షణమే పనులు సాగేలా చూడాలని డిమాండ్ చేశారు. నాయకులు ముంజ శ్రీనివాస్, దశరథరెడ్డి, తిరుపతిరెడ్డి, ఎస్ ఎన్రెడ్డి, మధుకర్, గొష్కి మధు, జలపతిరెడ్డి, గొపాల్రెడ్డి పాల్గొన్నారు.