అమెరికాలో పోలీసుల కాల్పులు.. మహబూబ్‌నగర్‌ యువకుడి మృతి | Mahabubnagar Resident Dies In California America | Sakshi
Sakshi News home page

అమెరికాలో పోలీసుల కాల్పులు.. మహబూబ్‌నగర్‌ యువకుడి మృతి

Sep 18 2025 10:23 PM | Updated on Sep 18 2025 10:32 PM

Mahabubnagar Resident Dies In California America

అమెరికాలో మహబూబ్‌నగర్‌ యువకుడు మృతి చెందాడు. అయితే, తన కుమారుడు మొహమ్మద్ నిజాముద్దీన్‌ను పోలీసులు కాల్చి చంపారని.. పోలీసులు ఎందుకు కాల్చి చంపారో కారణాలు తెలియడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు మృతుడి తల్లిదండ్రులు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. 

మహబూబ్‌నగర్‌ రామయ్య బౌలికి చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్..  డిసెంబర్ 2016లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి కాలిఫోర్నియాలోని శాంటా క్లారాకు వెళ్లాడు. ఆ యువకుడిని శాంటా క్లారా పోలీసులు కాల్చి చంపారు. మృతదేహం కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలోని ఓ ఆసుపత్రిలో ఉందని తమకు తెలిసిందని.. తమ కుమారుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్‌కు తీసుకురావడంలో  సాయం చేయాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. వాషింగ్టన్‌ డీసీలోని భారత కాన్సులేట్‌ ద్వారా సంప్రదింపులు జరపాలని అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement