లండన్లో యూదు స్వచ్ఛంద సంస్థకు చెందిన నాలుగు అంబులెన్సులను గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. దీంతో అందులోని సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనను ఆదేశ ప్రధాని కీర్ స్మార్టర్ ఖండించారు.
యూదు జనాభా ఎక్కువగా ఉండే లండన్లోని గోల్డర్స్ గ్రీన్ ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. గత సోమవారం తెల్లవారు జామున దుండగులు ఈచర్యకు పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో అత్యవసర సమయంలో వైద్య సహాయం అందించే నాలుగు అంబులెన్స్లు దగ్ధమయ్యాయి. వాహనాల్లోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో పక్కనే ఉన్న భవనాల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనను ఆదేశ్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా గత రెండేళ్లలో బ్రిటన్లో యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు భారీగా పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. 2022లో 1,662 ఘటనలు నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 3,700కు పెరిగిందని నివేదికలు పేర్కొన్నాయి.


