పాక్‌పై బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ కీలక ప్రకటన | Baloch fighters Sensational Comments On Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌పై బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ కీలక ప్రకటన

May 11 2025 6:57 PM | Updated on May 11 2025 7:01 PM

Baloch fighters Sensational Comments On Pakistan

మాంగోచార్‌ తమకు స్వతంత్ర దేశం కావాలని ఎప్పట్నుంచో డిమాండ్‌ చేస్తున్న బలూచ్‌ తిరుగుబాటు దారులు.. మరోసారి కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా గుర్తించాలంటూ డిమాండ్‌ చేశారు. అదే సమయంలో పాక్‌ ఉగ్రస్థావరాలపై దాడులకు దిగిన భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్‌పై భారత్‌ సైనిక చర్య తీసుకుంటే, పశ్చిమ సరిహద్దుల నుంచి పాక్‌పై తిరుగుబాటు చేస్తామన్నారు. భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తామంటూ ప్రకటించారు. 

పాకిస్తాన్‌లో 40 శాతం భూభాగం తమదేనని, తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్‌కు నిద్ర పట్టకుండా చేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏరివేతే లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టగా, అందుకు బలూచ్‌ తిరుగుబాటుదారులు సైతం మద్దతు తెలుపుతున్నారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement