
అరెస్ట్ చేసిన నిందితున్ని చూపుతున్న సీఐ
మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
హస్తినాపురం: అమాయకులకు మాయమాటలు చెప్పి..డబ్బు, బంగారాన్ని రెట్టింపు చేస్తానని నమ్మించి మోసానికి పాల్పడిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ జలేంధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం పెద్దగుమ్మడం గ్రామానికి చెందిన కోట్ల హరిక్రిష్ణ (35) వెంకటేశ్వరకాలనీలో నివాసం ఉంటున్నారు. ఇతను యూట్యూబ్ ద్వారా బంగారు వస్తువులను రెట్టింపు చేసే మ్యాజిక్ నేర్చుకున్నాడు. ఇటీవల వనస్థలిపురం కమలానగర్కు చెందిన పురంతు వీరయ్యతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరయ్య మొదట ఐదు వందల రూపాయల నోట్లు 74 ఇచ్చి రెట్టింపు చేయాలని కోరగా...హరికృష్ణ మోసంతో వాటిని రెట్టింపు చేసినట్లు నమ్మించాడు. ఈ క్రమంలో వీరయ్య కొన్ని బంగారు ఆభరణాలు కూడా ఇచ్చి రెట్టింపు చేయాలని కోరగా వాటిని ఒక బాక్సులో పెట్టి 40 రోజుల తర్వాత మూత తీసి చూడాలని చెప్పి వెళ్లిపోయాడు. 40 రోజుల తర్వాత బాక్సును వీరయ్య తెరిచి చూడగా అందులో తానిచ్చిన నగలు మాయం అయ్యాయి. దీంతో మోసపోయానని గుర్తించి వనస్థలిపురం పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని హరిక్రిష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా తానే మోసం చేశానని, బంగారాన్ని బీఎన్రెడ్డినగర్లో ఉన్న బంగారం షాపులో విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు హరిక్రిష్ణను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి లక్షన్నర నగదు, కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.