
పరేడ్గ్రౌండ్లో గిరిజన మహిళా కళాకారులు
హైదరాబాద్: నగరంలో సీడబ్ల్యూసీ భేటీతో కాంగ్రెస్ శ్రేణుల్లో సందడి నెలకొంది. శనివారం నగరానికి పార్టీ కేంద్ర నాయకత్వం కదిలి వచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాత సీడబ్ల్యూసీ భేటీ ఆతిథ్యానికి అవకాశం దక్కడంతో నగరం కాంగ్రెస్ జెండాలమయంగా మారింది. అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, భూపేశ్ బగేల్, అశోక్ గెహ్లోత్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, పార్టీ కేంద్ర నేతలు చిదంబరం, వీరప్ప మొయిలీ తదితరులకు పీసీసీ నేతలు ఘన స్వాగతం పలికారు. బంజారాహిల్స్లోని హోటల్ తాజ్కృష్ణ వేదికగా శనివారం మధ్యాహ్నం తర్వాత సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్టీ అతిరథ మహారథులకు స్వాగతం పలుకుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు పోటాపోటీగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు కటౌట్లు ఏర్పాటు చేశారు.
కళా నృత్యాలతో..
సీడబ్ల్యూసీ సమావేశాలకు వచ్చిన అగ్రనేతలకు బంజారాహిల్స్లోని తాజ్కృష్ణ వద్ద తెలంగాణ సంప్రదాయ నృత్యాలు, కళా బృందాలతో పీసీసీ ఘన స్వాగతం పలికింది. కళాకారులతో పాటు ఎమ్మెల్యే సీతక్క నృత్యం చేశారు. సీడబ్ల్యూసీ భేటీకి హాజరైన అతిథులకు తాజ్కృష్ణతో పాటు తాజ్ డెక్కన్, తాజ్బంజారా, హయత్ ప్లేస్ తదితర హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు. ఆదివారం కూడా సీడబ్ల్యూసీ భేటీ కొనసాగనుంది.