ఆర్టీసీ బస్సు ఢీ కొని మున్సిపల్‌ ఉద్యోగి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీ కొని మున్సిపల్‌ ఉద్యోగి దుర్మరణం

Sep 12 2023 5:46 AM | Updated on Sep 12 2023 6:30 AM

- - Sakshi

హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీ కొని మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. బౌరంపేటకు చెందిన ఎన్‌.శ్రీశైలం(35) దుండిగల్‌ మున్సిపాలిటీలో ఔట్‌ సొర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని బైక్‌పై గండిమైసమ్మ నుంచి మియాపూర్‌ వైపు వెళ్తున్నాడు.

బౌరంపేట కెఎల్‌హెచ్‌ యూనివర్సిటీ వద్ద వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు అతడి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మనీల, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement