కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని తల్లి ఆత్మహత్య

Mother commits suicide daughter married against her will - Sakshi

హైదరాబాద్: కూతురు ఇష్టం లేని వివాహం చేసుకోవడంతో మనస్థాపానికి గురైన తల్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం జయనగర్‌ కాలనీలోని గోనుగుంట శ్రీనివాసరావు, నిర్మల(45) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు నిహారిక ఐదు రోజుల క్రితం తన క్లాస్‌మేట్‌ను వివాహం చేసుకుంది.

ఇష్టంలేని పెళ్లి చేసుకోవడంతో మనస్థాపానికి గురైన నిర్మల సోమవారం సాయంత్రం బెడ్‌రూమ్‌లో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top