వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఆవరణలోని టెన్నిస్ కోర్టులో మంగళవారం నిర్వహించిన హనుమకొండ, వరంగల్ జిల్లాలస్థాయి అస్మిత సాఫ్ట్టెన్నిస్ బాలికల లీగ్పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలకు అతిథులుగా డీవైఎస్ఓ ప్రశాంత్, వరంగల్ క్లబ్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ హాజరై మాట్లాడారు. సాఫ్ట్టెన్నిస్ శారీరక దృఢత్వంతో పాటు చురుకుదనం, ఏకాగ్రతను పెంపొందిస్తుందని అన్నారు. బాలికల విభాగంలో అండర్–14 17, సీనియర్స్ మహిళలకు ఈ పోటీలు నిర్వహించినట్లు ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. సాఫ్ట్టెన్నిస్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ ఎరగ్రట్టు స్వామి, సీఐ వెంకటనారాయణ, సిరికొండ సుదర్శన్, కోచ్లు రమేష్, విష్ణువర్ధన్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.


