కాజీపేట: నీట్ హాల్ టికెట్ పోగొట్టుకుని ఏడుస్తున్న వి ద్యార్థినికి కాజీపేట ట్రాఫిక్ పోలీసులు చేయూతనందించి పరీక్ష రాయించారు. హనుమకొండ నక్కలగుట్టలోని శ్రీచైతన్య హైస్కూ ల్కు నీట్ పరీక్ష రాయడానికి శ్రావ్య ఆదివారం చేరుకుంది. ప్రయాణ హడావుడిలో ఆమె హాల్టికెట్ ఎక్కడో పడిపోయింది. దీంతో గేట్ వద్ద ఏడుస్తూ ఉన్న శ్రావ్యను ట్రాఫిక్ సిబ్బంది రాజేందర్, సతీశ్ చూశారు. విషయం తెలుసుకుని స్పందించారు. శ్రావ్యను ద్విచక్ర వాహనంపై జిరాక్స్ సెంటర్ వద్దకు తీసుకెళ్లారు. సెల్ఫోన్లో ఉన్న హాల్టికెట్ను ప్రింట్ తీయించి పరీక్ష కేంద్రం వద్దకు తీసుకెళ్లారు.


