బాలలకు భరోసా ఎంతో అవసరం | - | Sakshi
Sakshi News home page

బాలలకు భరోసా ఎంతో అవసరం

May 2 2026 7:20 AM | Updated on May 2 2026 7:20 AM

కాశిబుగ్గ: ప్రస్తుత పరిస్థితుల్లో బాలలకు భరోసా కల్పించడం ఎంతో అవసరమని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చైల్డ్‌ సేఫ్టీ అండ్‌ ప్రొడక్షన్‌– డ్రగ్స్‌ నో అనే అంశంపై ఏప్రిల్‌ 27 నుంచి మే 2 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖల సమన్వయంతో శుక్రవారం ఓ సిటీ స్టేడియంలో బాలభరోసా కార్యక్రమం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. బాలల భరోసా కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూ చించారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి పౌష్టికాహారం తీసుకోవా లని పేర్కొన్నారు. సరైన పోషణ ఉన్నప్పుడే పిల్లలు శారీరక, మానసిక ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. బాలల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, కార్పొరేటర్‌ ఓని భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆరోగ్య శిబిరం వద్ద ఉన్న ప్రత్యేక అవసరాల ఉన్న పిల్లల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వారికి తగిన వైద్య చికిత్సలు అందే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన సమ్మర్‌ క్యాంపును ప్రారంభించారు. వివిధ రకాల క్రీడలను తిలకించారు. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖతోపాటు కలెక్టర్‌ సత్యశారద క్రికెట్‌ ఆడారు.

అభివృద్ధిలో కార్మికుల శ్రమ కీలకం

ఖిలా వరంగల్‌: అభివృద్ధిలో కార్మికుల శ్రమ ఎంతో కీలకమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి సురేఖ పేర్కొన్నారు. వరంగల్‌ లక్ష్మీపు రం కూరగాయల మార్కెట్‌లో హమాలీ యూనియ న్‌ నాయకుడు సురేశ్‌ అధ్యక్షతన శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథి గా మంత్రి హాజరై కలెక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, వరంగల్‌ ఆర్డీఓ సుమ, మార్కెట్‌ కార్యదర్శి మల్లేశం, కార్మిక నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులకు ప్రతినెల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం రూ.50 వేలు మందుల కు మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. సంఘటి త కార్మికులకు రూ.549తో పోస్టాఫీస్‌ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోందని పేర్కొన్నారు. మార్కెట్‌ అధికారులు 1,325 మంది కార్మికులకు డబ్బులు చెల్లించి బీమా సౌకర్యం కల్పిస్తారని ఆమె వివరించారు. కార్మికుల విశ్రాంతికి, భోజనాలు చేయడానికి రూ.60 లక్షలతో కమ్యూనిటీహాల్‌ నిర్మాణానికి పంపిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. అనంతరం మార్కెట్‌లో వ్యాపారు లతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ అనిల్‌, నాయకులు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్‌, సోమిశెట్టి ప్రవీణ్‌, కొత్తపల్లి శ్రీనివాస్‌, జారతి రమేశ్‌, సత్యనారాయణ, వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జారతి శ్రీనివాస్‌, మున్నాభాయ్‌, వేణుగోపాల్‌, చందర్‌, శ్రీనివాస్‌, సాంబయ్య పాల్గొన్నారు.

రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ

మంత్రి కొండా సురేఖ

Advertisement
 
Advertisement
Advertisement