విద్యుదాఘాతానికి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి మహిళ మృతి

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

విద్యుదాఘాతానికి మహిళ మృతి జిల్లా కోర్టులో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల బదిలీ

తెనాలి: తెనాలిలో అదివారం రాత్రి కురిసిన వర్షం, గాలులకు తెగిపడిన విద్యుత్‌ తీగె ఉదయాన్నే ఓ నిండు ప్రాణం తీసింది. పట్టణ నాజరుపేటలోని రూరల్‌ పోలీసు స్టేషనుకు సమీపంలో రోడ్డు పక్కన ఇంటిలో నివసించే షేక్‌ ప్యారీజాన్‌ (68) సోమవారం ఉదయం ఇంటిముందు ఊడుస్తోంది. ఆదివారం రాత్రి కురిసిన వర్షం, గాలులకు రోడ్డుపై పడిన చెత్త ఊడ్చే క్రమంలో, సమీప పోలీస్‌స్టేషను ప్రాంగణంలో చెట్టుకొమ్మలు విరిగిపడటాన్ని గమనించారు. ఉత్సుకతతో చేతిలో డస్ట్‌బిన్‌తో సహా అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడ తెగిపడిన విద్యుత్‌ తీగె ఆమె కాలికి తగలటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెంది. ఇంటి బయట ఊడుస్తున్న ప్యారిజాన్‌ ఇంకా రాలేదేమని కుటుంబసభ్యులు ఆందోళనతో పరిసరాల్లో వెతుకుతుండగా విగతజీవురాలై కనిపించింది. ప్యారిజాన్‌ భర్త మాజీ సైనికుడు. ఇంతకుముందే మృతిచెందారు. కుమార్తెకు వివాహమైంది. గతేడాది ప్యారిజాన్‌ హజ్‌యాత్రకు కూడా వెళ్లివచ్చారు.

గుంటూరు లీగల్‌: గుంటూరు జిల్లా కోర్టు పరిధిలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయికళ్యాణ్‌ చక్రవర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా సేవలు–ఏపీజీఎంఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందిని వివిధ కోర్టులకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement