ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి
ఉపాధ్యాయులు తప్పనిపరిగా టెట్ రాసి ఉత్తర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి. 20, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన టీచర్లను ఇప్పుడు టెట్ రాసి ఉత్తర్ణత సాధించాలనడం ఒత్తిడికి గురిచేస్తోంది. ఉద్యోగోన్నతులకు టెట్లో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన సరికాదు. బీఈడీ, డీఈడీ పూర్తి చేసి, డీఎస్సీతో ఎంపికై న వారికి టెట్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన సవరించాలి.
ఇన్ సర్వీసు వారిని మినహాయించాలి
టెట్ నోటిఫికేషన్లో ఇన్ సర్వీసు ఉపాధ్యాయులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం 2011కు ముందు టెట్ అమలులో లేదు. టెట్ అమలులోకి రాకముందు నియాకమైన ఉపాధ్యాయులకు ఆ పరీక్ష నుంచి మినహాయింపు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి.
పట్టించుకోని చంద్రబాబు సర్కారు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణత సాధించడం ఉపాధ్యాయులందరికీ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ఆందోళన కలిగిస్తోంది. టీచర్లు ప్రస్తుత సర్వీసు కొనసాగించాలన్నా, ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 15 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, వారిలో దాదాపు ఎనిమిది వేల మంది టెట్ రాయాల్సి ఉంటుందని అంచనా. మినహాయింపునకు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీ నేటికీ అమలు కాకపోవడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– వై.థామస్రెడ్డి, వైఎస్సార్ టీచర్స్
అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
– ఎం.కళాధర్,
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి


