31న మా ఏపీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

31న మా ఏపీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు

Mar 23 2026 8:45 AM | Updated on Mar 23 2026 8:45 AM

31న మా ఏపీ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు

తెనాలిటౌన్‌: మా–ఏపీ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన వివిధ రంగాల్లోని ప్రముఖులు ఎనిమిది మందికి అష్టదిగ్గజాల పేరిట ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్‌రాజా వెల్లడించారు. తెనాలిలో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌, 24 విభాగాల యూనియనన్‌్‌ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక ఆలపాటి నగర్‌లోని రత్న ఫార్చూన్‌ కల్యాణ మండపంలో ఈ వేడుకలు జరుగుతాయని చెప్పారు. ఈ వేడుకలకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ముఖ్య అతిథిగా హాజరవుతారు. తమ సంస్థ అష్టదిగ్గజాలుగా ఎంపిక చేసిన ప్రముఖుల్లో రాష్ట్రంలో ప్రమాదాల నివారణలో 2025 సంవత్సరానికి ప్రథమ స్థానం పొందిన జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌, కుష్టు, ఎయిడ్స్‌ పీడితులకు సాయం చేస్తున్న హార్వెస్ట్‌ ఆఫ్‌ ఇండియా అధినేత కత్తెర సురేష్‌ కుమార్‌ర్‌, అనాధ శవాల దహనసంస్కారి కుర్రా శ్రీను, ఉచిత వైద్య శిబిరాల శిఖరం డాక్టర్‌ డి.శారద, వృద్ధాశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి, కూచిపూడి కళాకారిణీ తేజస్వి ప్రఖ్య, షార్ట్‌ ఫిలిమ్స్‌ ఉత్తమ నటి సుజిత, యూట్యూబ్‌ ఉత్తమ కేరెక్టర్‌ నటి సాయిప్రకర్షలను ఎంపిక చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాసయాదవ్‌, పెదరావూరు ఫిలిం స్టూడియోస్‌ మేనేజర్‌ పినపాటి సురేష్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement