ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల

Mar 27 2026 9:13 AM | Updated on Mar 27 2026 9:13 AM

ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా విడుదల గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ఉద్యోగోన్నతులకు సంబంధించి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ కేడర్ల వారీగా తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ సలీమ్‌ బాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక, జనరల్‌ సీనియారిటీ జాబితాను సంబంధిత ఉపాధ్యాయుల అర్హతల ఆధారంగా సబ్జెక్టుల వారీగా డీఈవో.జీఎన్‌టీ.బ్లాగ్‌స్పాట్‌.కామ్‌లో ఉంచినట్లు తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సంబంధిత అధికారి ద్వారా తగిన ధ్రువపత్రాలతో ఈనెల 31వ తేదీ లోపు సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు అన్ని పని దినాల్లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని వినతుల స్వీకరణ కమిటీకి సమర్పించాలని సూచించారు. నిర్ధిష్ట గడువు అనంతరం అందిన వినతులు స్వీకరించబడవని పేర్కొన్నారు. జీజీహెచ్‌, వైద్య కళాశాలల్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం చార్టెడ్‌ అకౌంట్‌ రీసెర్చ్‌ కమిటీ సభ్యుడిగా ‘చేకూరి’

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌, గుంటూరు వైద్య కళాశాలలో పలు ఉద్యోగాలను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగార్జునకొండ వెంకటసుందరాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌ ఉద్యోగాలు 85, ఆఫీస్‌ సబార్డినేట్స్‌ 26, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ 20, ల్యాబ్‌ అటెండెంట్‌ 10, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌ 8, ఇలా 27 రకాల ఉద్యోగాలు జీజీహెచ్‌, వైద్య కళాశాలలో భర్తీ చేస్తున్నామన్నారు. ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత ఉన్నవారు ఏప్రిల్‌ 2న సాయంత్రం 5 గంటల్లోపు తమ దరఖాస్తులను గుంటూరు మెడికల్‌ కళాశాలలో అందజేయాలన్నారు. డిస్ట్రిక్ట్‌ సెక్షన్‌ కమిటీ ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతోందన్నారు. విద్యార్హతలు, వేతనాలు, ఇతర వివరాల కోసం http: guntur.ap.gov.in లేదా www. gunturmedicalcollege.edu.in గుంటూరు మెడికల్‌ కాలేజ్‌.ఈడీయూ.ఇన్‌ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. ఏప్రిల్‌ 13న ఉద్యోగాలకు ఎంపికై న వారి ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టును ప్రదర్శిస్తామన్నారు.

నరసరావుపేట టౌన్‌: చార్టెడ్‌ అకౌంట్‌ ఆఫ్‌ ఇండియా న్యూఢిల్లీ నేషనల్‌ రీసెర్చ్‌ కమిటీ సభ్యుడిగా నరసరావుపేట కు చెందిన ప్రముఖ ఆడిటర్‌ చేకూరి సాంబశివరావు ఎంపికయ్యారు. ఈ మేరకు నియామాక పత్రాన్ని గురువారం రీసెర్చ్‌ కమిటీ చైర్మన్‌ విశాల్‌ దోషి చేతుల మీదుగా అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న 449వ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించటం జరిగిందన్నారు. కౌన్సిల్‌ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధ్యక్షుడు రీసెర్చ్‌ కమిటీ 2026–27 పునఃవ్యవస్థీకరించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement