వరికూటి ఆందోళనతో కదిలిన ఎకై ్సజ్‌ శాఖ | - | Sakshi
Sakshi News home page

వరికూటి ఆందోళనతో కదిలిన ఎకై ్సజ్‌ శాఖ

May 3 2025 7:42 AM | Updated on May 3 2025 7:42 AM

వరికూ

వరికూటి ఆందోళనతో కదిలిన ఎకై ్సజ్‌ శాఖ

సాక్షి ప్రతినిధి,బాపట్ల: మద్యం బెల్టు షాపులపై వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు చేపట్టిన వినూత్న నిరసన ఫలితాన్నిచ్చింది. ఆయన చేపట్టిన ఆందోళనకు ఎకై ్సజ్‌ శాఖ స్పందించింది. శుక్రవారం వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలంలో పలు మద్యం దుకాణాలను ఎకై ్సజ్‌ అధికారులు తనిఖీ చేశారు.

పల్లెకోన గ్రామంలో మద్యం అమ్ముతున్న సుబ్బారావుని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు రేపల్లె స్టేషన్‌ పరిధిలో 35 కేసులు, భట్టిప్రోలు మండలంలో 15 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏ గ్రామంలోనైనా బెల్టు షాపులు, పర్మిట్‌ రూములు నిర్వహిస్తే రేపల్లె ఎకై ్సజ్‌ పోలీసుస్టేషన్‌ ఫోన్‌ నంబర్‌ 9440902476 నంబర్‌కు ఫోన్‌ చేయాలని తెలిపారు. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బెల్టుషాపులు నిరోధించే వరకూ ఉద్యమం

– వరికూటి అశోక్‌బాబు

వేమూరు నియోజకవర్గంలో బెల్టుషాపులతోపాటు పర్మిట్‌ రూములు నిరోధించేవరకూ ఉద్యమాన్ని నిర్వహిస్తామని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన సూపర్‌సిక్స్‌ పథకాలు కాకుండా ప్రజలకు మద్యం సరఫరా చేస్తోందన్నారు. వాడవాడలా మద్యం దుకాణాలు ఏర్పాటుతో ఆ మద్యం సేవించి పేదలు ఎస్సీ,ఎస్టీ,బలహీన వర్గాలు ఆర్థికంగా చితికి పోతున్నాయన్నారు. తక్షణం బెల్టుదుకాణాలు, పర్మిట్‌ రూములను నిలిపి వేయాలన్నారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అశోక్‌బాబు హెచ్చరించారు.

మద్యం షాపుల్లో తనిఖీలు పలు బెల్టు షాపులపై కేసులు ఫిర్యాదు చేస్తే చర్యలకు సిద్ధమన్న ఎకై ్సజ్‌ పోలీసులు

వరికూటి ఆందోళనతో కదిలిన ఎకై ్సజ్‌ శాఖ 1
1/1

వరికూటి ఆందోళనతో కదిలిన ఎకై ్సజ్‌ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement