ఎకరాకు రూ.1.50 లక్షలు నష్టం | - | Sakshi
Sakshi News home page

ఎకరాకు రూ.1.50 లక్షలు నష్టం

May 31 2025 1:39 AM | Updated on May 31 2025 1:39 AM

ఎకరాకు రూ.1.50 లక్షలు నష్టం

ఎకరాకు రూ.1.50 లక్షలు నష్టం

నాలుగు ఎకరాల్లో తేజ రకం మిర్చి పంట సాగు చేశాను. గత ఏడాది ఎకరాకు సుమారు 25 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది మిర్చి పంటకు రక రకాల తెగుళ్లు వ్యాపించడంతో పాటు వాతావరణంలో మార్పుల కారణంగా 10 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితులు లేవు. అందులో సగానికి పైగా తాలు వచ్చింది. ఎకరాకు ఇప్పటివరకు విత్తనం మొదలు, పురుగు మందులు, కోత కూలీలు, తొక్కుడు, బాడుగ, కౌలు కలుపుకొని రూ.2.50 లక్షలు వరకు ఖర్చు వచ్చింది. అంటే మొత్తం నాలుగు ఎకరాలకు రూ.10 లక్షల వరకు ఖర్చు వచ్చింది. గత ఏడాది క్వింటా రూ.23 వేలు నుంచి రూ.28 వేలు వరకు పలికిన తేజ రకం ఎరుపు కాయలకు ఈ ఏడాది రూ.9 వేలు నుంచి రూ.10 వేలు పలుకుతోంది. జనవరిలో 25 బస్తాలు గుంటూరు యార్డుకు తీసుకువచ్చాను. క్వింటాకు రూ.13,500 ధర వచ్చింది. మార్చి నెలలో మరో 20 బస్తాలు తీసుకువెళ్తే క్వింటా రూ.9 వేలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక తాలు రకం గత ఏడాది క్వింటాకు రూ.16 వేలు ధర ఉంటే ఈ ఏడాది రూ.4,500 వేలు కూడా ధర దక్కడం లేదు. ఈ ఏడాది మొత్తం మీద ఎకరాకు సుమారు రూ.1.50 లక్షల చొప్పున మొత్తం రూ.6 లక్షల వరకు నష్టం రావడం ఖాయం.

– దారం ఎలీసారెడ్డి, దారంవారిపాలెం గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement