
సంక్షేమం సున్నా!
పాలనకు ఏడాదైనా..
కూటమి ఏడాది పాలనలో అన్నివర్గాలకు తీరని అన్యాయం
క్ర.సం. పథకం పేరు లబ్ధిదారుల సంఖ్య లబ్ధి మొత్తం(రూ.కోట్లలో)
1. వైఎస్సార్ ఆసరా 2,90,994 808.60
2. జగనన్న అమ్మ ఒడి 2,01,590 657.39
3. జగనన్న అమ్మ ఒడి (అదర్స్) 1,87,574 47.32
4. అర్చకుల గౌరవ వేతనం 1,051 0.53
5. జగనన్న చేదోడు 11,397 32.59
6. వైఎస్సార్ ఉచిత పంటల బీమా 57,207 74.47
7. వైఎస్సార్ ఈబీసీ నేస్తం 25,401 67.72
8. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు 45,615 543.66
9. ఇమామ్లు, మౌజన్లకు వేతనం 120 0.06
10. వైఎస్సార్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 65,758 78.10
11. జగనన్న తోడు (వడ్డీ) 33,485 1.47
12. జగనన్న తోడు (రుణాలు) 68,163 108.32
13. జగనన్న వసతి దీవెన 1,05,471 115.86
14. జగనన్న విద్యా దీవెన 1,15,392 364.94
15. వైఎస్సార్ కల్యాణమస్తు 1,297 11.65
16. వైఎస్సార్ కాపు నేస్తం 21,502 97.71
17. వైఎస్సార్ లా నేస్తం 243 3.04
18. వైఎస్సార్ మత్స్యకార భరోసా 269 0.58
19. వైఎస్సార్ నేతన్న నేస్తం 940 7.30
20. పాస్టర్ల గౌరవ వేతనం 1,823 0.91
21. వైఎస్సార్ రైతు భరోసా 1,77,545 885.97
22. వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణం 48,397 13.61
23. వైఎస్సార్ సున్నావడ్డీ (ఎస్హెచ్జీఎస్) 3,77,515 100.73
24. వైఎస్సార్ వాహన మిత్ర 17,574 61.16
25. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 54,315 42.26
26. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 86,931 394.80
27. వైఎస్సార్ బీమా 5,324 79.33
28. వైఎస్సార్ చేయూత 1,14,844 503.93
29. వైఎస్సార్ పెన్షన్ కానుక 2,96,952 2847.82
30. జగనన్న విదేశీ విద్యా దీవెన 42 3.68
31. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం 4 0.04
మొత్తం 24,14,735 7,955.54
సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమం మాటలకే పరిమితం అయింది. దీంతో ప్రజలకు ఆర్థికంగా చేయూత లేకపోవడంతో కొనుగోలు శక్తి క్షీణించింది. మార్కెట్లో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాజధాని పేరుతో చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం మినహా మిగతావి ముందుకు సాగడం లేదు. దీంతో ఏడాది కూడా గడవకముందే కూటమి పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.
పింఛన్ల తనిఖీ పేరుతో రద్దు
సంక్షేమంపై ఏ మాత్రం దృష్టి పెట్టని చంద్రబాబు ప్రభుత్వం పేదల నోటి దగ్గర కూడు కూడా లాక్కొనేందుకు సన్నద్ధం అవుతోంది. పండుటాకులపై తన ప్రతాపం చూపిస్తోంది. దీనిలో భాగంగా పింఛన్ల తనిఖీ పేరుతో ఉన్న వాటినీ తొలగిస్తోంది. ఇప్పటి వరకు 6,798 మందికి వివిధ సాకులతో పింఛను రద్దు చేశారు. తాజాగా పైలెట్ వెరిఫికేషన్ పేరుతో ప్రతి జిల్లాలో ఒక సచివాలయం పరిధిలో తనిఖీ చేశారు. పింఛన్దారుల పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ మరోసారి వారి వివరాలు సేకరించి యాప్లో నమోదు చేశారు. ఆరు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ వివరాలు సేకరించారు. వీటిలో తేడాలు ఉన్నాయంటూ రద్దు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు.
అమలుకాని హామీలు
ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు జిల్లాలో పర్యటించి పలు హామీలు ఇచ్చారు. వాటిలో కనీసం ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు.
ముస్లింలకు మొండిచేయి
‘ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్లకు స్థలాలు కేటాయిస్తాం. హజ్ యాత్రకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తాం. నూర్బాషా కార్పొరేషన్ పెట్టి ఏడాదికి రూ.వంద కోట్లు ఆర్థిక సాయం చేస్తాం. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాది’ అంటూ గతంలో గుంటూరు పర్యటనలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. పైగా ఉన్న వక్ఫ్ భూములను బయట వ్యక్తులకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం తెగించింది. గుంటూరులోనే ఐటీ టవర్లు కట్టి వర్క్ ఫ్రం హోం విధానం తీసుకొస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత ఆ ఊసు మర్చిపోయారు.
రూ.7,955.54 కోట్ల మేరకు లబ్ధి
వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాలో సంక్షేమ పథకాలకు మొత్తం రూ.7,955.54 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలో 2019–24 కాలంలో 24,14,735 లక్షల మందికి రూ.7,955.54 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. ఇందులో అత్యధికంగా వైఎస్సార్ ఆసరా కింద 2,90,994 మందికి రూ.808.60 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా కింద 1,77,545 మందికి రూ.885.97 కోట్లు, జగనన్న అమ్మ ఒడి ద్వారా 2,01,590 మంది లబ్ధిదారులకు రూ.657.30 కోట్లు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా 45,615 మందికి రూ.543.66 కోట్లు లబ్ధి చేకూరింది.
అన్నీ మాటలకే పరిమితం
ఏడాదైనా ఇంకా అదే తీరు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను అమలు చేయలేదు. ప్రతి మహిళకు రూ.1500 ఇస్తామన్నారు. దాని ఊసే లేదు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ఏటా రైతుకు రూ.20,000 ఆర్థిక సాయం ఇస్తామని చెప్పినా ఏడాది గడిచినప్పటికీ వాటి ప్రస్తావనే లేదు. ఇప్పటికీ ప్రజలకు మాటలతో కూటమి ప్రభుత్వం మోసగిస్తూనే ఉంది.
కార్యాలయాల వద్ద పడిగాపులు
గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే అన్ని సేవలు అందేవి. కూటమి అధికారంలోకి వచ్చాక అన్నీ ఆగిపోయాయి. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి.
– స్వాతి, గుంటూరు
అధికారం కోసం అబద్ధాలు
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు ఎన్నో పొందాం. కూటమి సర్కారు ఏర్పడితే ఏవేవో ఇస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటీ అమలు చేయకపోవడం బాధాకరం. కేవలం అఽధికారం కోసమే అబద్ధపు మాటలు చెప్పారు. ఏడాదైనా సంక్షేమ పథకాల ఊసే లేదు.
– లలితమ్మ, గుంటూరు
వైఎస్సార్సీపీ హయాంలో అన్ని
వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు
విద్యార్థుల చదువులకు
ఇబ్బంది ఉండేది కాదు
ఇళ్లు లేని పేద ప్రజలకు స్థలాలు
ఇచ్చి కట్టించిన వైనం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి
వచ్చి సంవత్సరం గడిచినా ఒక్కటీ
అమలు కాని సంక్షేమ పథకాలు
అసలు ఆ ఊసే వినిపించకపోవడంతో
బాబు పాలనపై అన్ని వర్గాలు ఆగ్రహం
ప్రకటనలకే పరిమితమవుతున్న
కూటమి పాలకులు
మోసపు మాటలతో అధికారంలోకి
వచ్చి అదే బూటకపు ముచ్చట్లు
నమ్మించి నట్టేట ముంచిన పాలకులు
ఉన్న సంక్షేమ పథకాలు కూడా
కోల్పోయిన ఆవేదనలో ప్రజలు
నిరుద్యోగ
భృతి
తల్లికి వందనంగా ఏటా రూ.15,000 ఇస్తాం. నిరుద్యోగులకు భృతిగా నెలకు రూ.3000 చొప్పున ఇస్తాం. ఏటా అన్నదాతలకు రూ.20,000 వేలు ఇచ్చి ఆదుకుంటాం. ఆడబిడ్డకు నిధిగా ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అంటూ ఊరించినా ఒక్కటి కూడా అమలు చేయలేదు. గుంటూరులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. ఇప్పటివరకూ దీనిపై చంద్రబాబు సమీక్షించిన పాపాన పోలేదు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కూడా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. గుంటూరు అమరావతి రాజధానిలో భాగం. ‘హైదరాబాద్, సికింద్రాబాద్లకు తోడుగా సైబరాబాద్ నిర్మించి ఒక మహానగరానికి శ్రీకారం చుట్టాను. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు కేవలం 163 కి.మీ మాత్రమే... కానీ, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 180 కి.మీ.తో ఏర్పాటు చేస్తానని’ చంద్రబాబు చెప్పారు. ఈ ప్రక్రియ కూడా నత్తనడకన సాగుతోంది.

సంక్షేమం సున్నా!