యోగాతో సామర్థ్యం మెరుగు | - | Sakshi
Sakshi News home page

యోగాతో సామర్థ్యం మెరుగు

Jun 5 2025 1:32 PM | Updated on Jun 5 2025 1:32 PM

యోగాతో  సామర్థ్యం మెరుగు

యోగాతో సామర్థ్యం మెరుగు

నగరంపాలెం: యోగా, ధ్యానం అభ్యాసం వల్ల మనిషి ఆలోచనా విధానం, సామర్థ్యం మెరుగుపడతాయని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ అన్నారు. నాషా ముక్త భారత్‌ అభియాన్‌లో భాగంగా బుధవారం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో యోగా అభ్యాసం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ యోగా, ధ్యానం అనేవి శారీరకంగా, మానసికంగా మనిషి స్థితిగతులను మార్చగలిగే అంశాలు అన్నారు. మానసిక స్థిరత్వం, ప్రశాంతత అలవడతాయని చెప్పారు. ఒత్తిళ్లను అధిగమించే శక్తి పెంపొందుతుందని పేర్కొన్నారు. క్రమశిక్షణ అలవాటై, దురలవాట్లకు దూరంగా ఉంటారని అన్నారు. జిల్లా ఏఎస్పీ (ఏఆర్‌) హనుమంతు, ఏఆర్‌ డీఎస్పీ ఏడుకొండలురెడ్డి, ఆర్‌ఐ శ్రీహరిరెడ్డి, పోలీస్‌ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement