
నాడు
నేడు
దేశవ్యాప్తంగా పేరొందిన సచివాలయాలను ఒక క్రమపద్ధతిలో నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యత్నిస్తుంది. ఫలితం నాడు ప్రజలు, ఉద్యోగులతో కళకళలాడిన సచివాలయాలు నేడు వెలవెలబోతున్నాయి. నాడు అన్ని ప్రభుత్వ సేవలు తమ ఇంటిదగ్గర్లోని సచివాలయాల్లో అందుకున్న ప్రజలు నేడు మీసేవ, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు నెట్సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఆపసోపలు పడుతున్నారు. మమ్మల్ని గెలిపిస్తే గౌరవ వేతనం రెట్టింపు చేస్తామని వలంటీర్లను నమ్మబలికిన చంద్రబాబు నేడు అధికారంలోకి వచ్చాక హామీకి మంగళం పాడి.. వారి ఉద్యోగాలు ఊడబెరికి, రోడ్డున నిలబెట్టారు.
మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నెరవేర్చే క్రమంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే విప్లవాత్మకమైన సచివాలయ వ్యవస్థకు నాంది పలికారు. ప్రజలకు తమ సమీపంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం, సర్టిఫికెట్లు, ఆరోగ్య, ఇతర సేవలు అందేలా వ్యవస్థను రూపొందించారు. ఆ సచివాలయాల్లో వేలమందికి ప్రభుత్వ ఉద్యోగాలు సైతం కల్పించారు. సచివాలయాలకు అనుబంధంగా ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసింది. వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రజలు ఇంటివద్దనే ప్రభుత్వ సేవలు పొందారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతను దేశం వేన్నోళ్లా పొగిడింది.

నాడు