సేవలకు మంగళం | - | Sakshi
Sakshi News home page

సేవలకు మంగళం

Jun 8 2025 1:24 AM | Updated on Jun 8 2025 1:24 AM

సేవలక

సేవలకు మంగళం

క్లస్టర్లు 11062

కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు పొమ్మనలేక పొగపెడుతుంది. సచివాలయ సిబ్బందిలో అధికశాతం మంది ఉన్నత విద్యనభ్యసించినవారే. ఎంటెక్‌, ఎమ్మెస్సీ వంటి కోర్సులు చేసిన వారున్నారు. కొందరు పీహెచ్‌డీలు కూడా చేశారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం సాధించాలని సచివాలయ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఒకే నోటిఫికేషన్‌తో లక్షన్నరకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం, జీవితానికి భద్రత ఉంటుందని భావించిన వీరంతా లక్షల మందితో పోటీ పడి సచివాలయ ఉద్యోగాలు సాధించారు. ప్రొబేషన్‌ తరువాత రెగ్యులర్‌ ఉద్యోగులయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేశారు. ఐదేళ్లు గడిచిపోయాయి. నేడు కూటమి ప్రభుత్వం సర్వేల పేరుతో వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.

నెహ్రూనగర్‌(గుంటూరుఈస్ట్‌): సూర్యో దయానికంటే ముందే వలంటీర్లు ఇంటి తలుపుతట్టి నెలలో మొదటి తేదీన పింఛన్‌ ఇచ్చేవారు. 50 ఇళ్లకో వలంటీరు ద్వారా ప్రజలకు సేవలు అందేవి. వారిని కూటమి పార్టీలు సంఘ విద్రోహశక్తుల్లా అభివర్ణించాయి. అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థకు మంగళం పాడేశాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎలాంటి సర్టిఫికెట్లు కావాలన్నా ఉచితంగా ఇంటి సమీపంలోనే అందేవి. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పింది. నేడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అవి కళతప్పాయి. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగే దుస్థితి ఏర్పడింది. సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ఐదేళ్లు జిల్లావ్యాప్తంగా 51,66,759 సేవలు అందాయి. నేడు ఈ సేవలన్నింటికీ మంగళం పాడారనే చెప్పుకోవాలి.

కళ కోల్పోయిన సచివాలయాలు

గుంటూరు జిల్లాలో మొత్తం 568 సచివాయాలున్నాయి. ఇందులో గ్రామ సచివాలయాలు 232, వార్డు సచివాలయాలు 236 ఉన్నాయి. వీటిలో మొత్తం 5,563 మంది ఉద్యోగులు ప్రజలకు వివిధ రకాల ప్రభుత్వ సేవలు అందించేవారు. సచివాలయం మెట్లు ఎక్కిన వారికి అవసరమైన పనిని నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ఇచ్చేవారు. సేవలన్నీ ఉచితంగా అందేవి. దీంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలతో సచివాలయాలు కళకళలాడుతూ ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటి ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. మీ సేవ కేంద్రాలకు, నెట్‌ పాయింట్లకు, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి కల్పించింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో దాదాపుగా ప్రతి గ్రామంలోనూ సచివాలయాలకు సొంత భవనాలు నిర్మించింది. ప్రస్తుతం సచివాలయాలు కళ తప్పాయి.

సచివాలయానికి టార్గెట్లు

రాష్ట్ర ప్రభుత్వం పీ4 సర్వే, ఈకేవైసీ, ఇంటింటి సర్వే, స్ట్రీట్‌ వెండర్స్‌ సర్వేలతో సచివాలయ ఉద్యోగులను వేధిస్తోంది. వీటన్నిటితో పాటుగా యోగాంధ్ర సర్వే పేరిట సచివాలయానికి 1500 మందిని ఎన్‌రోల్‌ చేయాలని టార్గెట్లు ఇచ్చింది. సచివాలయ సెక్రటరీలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించి వారి ఫోన్లకు మేసేజ్‌ పంపించి.. ఓటీపీ చెప్పించుకుని వారిని భాగస్వాములను చేయాలని ఆదేశించింది. దీంతో సెక్రటరీలు ప్రజల వద్దకు వెళ్లి ఓటీపీలు చెప్పాలని కోరితే వారు ఓటీపీ చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. అటు ప్రజలకు చెప్పుకోలేక.. ఇటు ప్రభుత్వానికి వివరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వలంటీర్ల ద్వారా అద్భుత సేవలు

పొమ్మనలేక పొగ

నాడు ఇంటివద్దకే అన్ని సేవలు నేడు సేవలు అందక ప్రజలు ఇక్కట్లు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం వివిధ రకాల సర్వేల పేరిట సిబ్బందిపై అదనపు భారం ప్రభావం కోల్పోయిన గ్రామ స్వరాజ్యం వలంటీర్లను నిలువునా మోసం చేసిన చంద్రబాబు

సిబ్బంది 5563

గత ప్రభుత్వంలో జిల్లాలో సచివాలయాల సేవలు

సేవలు 543

గత ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ఇంటి ముగింటకే అన్ని సేవలూ అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ.5వేల గౌరవవేతనంతో రౌండ్‌ ది క్లాక్‌ విధులు నిర్వర్తించిన వలంటీర్లకు ప్రజలు జేజేలు కొట్టారు. వలంటీర్లు క్షేత్రస్థాయిలో వారికి కేటాయించిన ప్రతి ఇంటికెళ్లి ప్రభుత్వ పథకాలను అర్హుల చేతికి అందించేవారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి తలుపుకొట్టి అవ్వాతాతలకు పింఛన్లు అందజేశారు. ఎవరైనా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఉంటే దూరమైనా సరే.. అక్కడికి వెళ్లి మరీ పింఛను నగదు చేతిలో పెట్టేవారు.

కరోనా సమయంలో వారు చూపిన సేవాగుణం అమోఘం.. మహమ్మారి సోకి ఇంటివారే దూరం పెట్టిన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మరీ ఆహారం, నిత్యావసరాలు, మందులు తదితరాలు అందించి, ఎందరికో అండగా నిలిచారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హుల ఇళ్లకు వెళ్లి దరఖాస్తు చేయించేవారు. జిల్లావ్యాప్తంగా 10,089 మంది వలంటీర్లు నిరంతరం ప్రజా సేవలో ఉండేవారు. ఎన్నికల ముందు వేతనాలు పెంచి ఈ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మంగళం పాడేసింది.

సేవలకు మంగళం 1
1/3

సేవలకు మంగళం

సేవలకు మంగళం 2
2/3

సేవలకు మంగళం

సేవలకు మంగళం 3
3/3

సేవలకు మంగళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement