
సర్వేల పేరిట వేధిస్తున్నారు
సర్వేల పేరిట రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను గత 10 నెలల నుంచి తీవ్ర పని ఒత్తిడికి గురి చేస్తుంది. సెలవు రోజుల్లో సైతం విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో వలంటీర్లు చేసిన విధులన్నింటినీ సెక్రటరీలకు అప్పగించి పెద్ద వలంటీర్లను చేసి అవమానిస్తున్నారు. ప్రస్తుతం యోగాంధ్ర పేరుతో ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని ఆదేశించింది. ప్రజలు ఓటీపీలు చెప్పేందుకు వెనకడగు వేస్తున్నారు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సమస్యలను గుర్తెరిగి సర్వే విధులను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాలి.
– షేక్ అబ్దుల్ రజాక్, గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు