సివిల్స్‌ ర్యాంకర్‌కు తెలంగాణ గవర్నర్‌ సత్కారం | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ ర్యాంకర్‌కు తెలంగాణ గవర్నర్‌ సత్కారం

Jun 5 2025 1:32 PM | Updated on Jun 5 2025 1:32 PM

సివిల్స్‌ ర్యాంకర్‌కు తెలంగాణ గవర్నర్‌ సత్కారం

సివిల్స్‌ ర్యాంకర్‌కు తెలంగాణ గవర్నర్‌ సత్కారం

తెనాలి: గత నెలలో వెలువడిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ర్యాంకు సాధించిన తెనాలికి చెందిన దోనేపూడి విజయ్‌బాబును బుధవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సత్కరించారు. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌–2024 పరీక్షల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ర్యాంకర్లను తెలంగాణ రాజ్‌భవన్‌ దర్బార్‌ హాలులో ఆ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సత్కరించారు. అందులో భాగంగా విజయ్‌బాబు సత్కారం అందుకున్నారు. ఆయన గతంలోనే సివిల్స్‌లో ర్యాంక్‌ సాధించి, ఐఆర్‌ఎస్‌ అధికారిగా సేవలను అందిస్తున్నారు. మెరుగైన ర్యాంకు కోసం మళ్లీ 2024 పరీక్షలు రాశారు. ఆ పరీక్షలోని ర్యాంకర్లకు ఇంకా పోస్టింగులు ఇవ్వాల్సివుంది. ఐపీఎస్‌ వస్తుందని విజయ్‌బాబు, ఆయన తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement