● గత ప్రభుత్వంలో వరుసగా నాలుగేళ్లు నిరాటంకంగా అమ్మఒడి అమలు ● తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లులను మోసగించిన కూటమి ప్రభుత్వం ● చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని హామీ ● గుంటూరు జిల్లాలోని విద్యార్థులు, తల్లులకు రూ. 540 కోట్లు బకాయి పడిన | - | Sakshi
Sakshi News home page

● గత ప్రభుత్వంలో వరుసగా నాలుగేళ్లు నిరాటంకంగా అమ్మఒడి అమలు ● తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లులను మోసగించిన కూటమి ప్రభుత్వం ● చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని హామీ ● గుంటూరు జిల్లాలోని విద్యార్థులు, తల్లులకు రూ. 540 కోట్లు బకాయి పడిన

Jun 6 2025 6:11 AM | Updated on Jun 6 2025 6:11 AM

● గత

● గత ప్రభుత్వంలో వరుసగా నాలుగేళ్లు నిరాటంకంగా అమ్మఒడి అ

నేడు తల్లికి మంగళం!

తల్లికి వందనం ద్వారా జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న 3.60 లక్షల మంది విద్యార్థులకు రూ.15వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న మూడు లక్షల మంది విద్యార్థులతో పాటు ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు 60వేల మంది ఉన్నారు. ఈ విధంగా ఒక్కో విద్యార్థికి రూ.15వేలు చొప్పున రూ.540 కోట్లు బకాయి పడింది.

గుంటూరు ఎడ్యుకేషన్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన చదువుల విప్లవంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నాణ్యమైన విద్యను పొందారు. కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నే విధంగా డిజిటల్‌ చదువులను అమల్లోకి తెచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని సమూలంగా మార్చివేశారు. తరగతిగదిలో బ్లాక్‌బోర్డుపై రాసిన పాఠ్యాంశాలను చదువుకునే రోజుల నుంచి చేత్తో తాకే తెరపై ప్రపంచం నలుమూలలా దాగి ఉన్న సమస్త విజ్ఞానాన్ని, సమాచారాన్ని తరగతిగదిలోనే అందుకున్నారు. వైఎస్‌ జగన్‌ పాలనలో సువర్ణాధ్యాయంగా నిలిచిన ప్రభుత్వ విద్యావ్యవస్థ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో తిరోగమనం దిశగా పయనిస్తోంది. వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో పైసా ఖర్చు లేని ఉచిత విద్యకు ఇచ్చిన భరోసా ప్రస్తుతం కనుమరుగైంది.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పాలనలో నాడు–నేడు ద్వారా రూ.43 లక్షలతో ఆధునికీకరించిన గుంటూరు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో బ్లాక్‌బోర్డు స్థానంలో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ (ఐఎఫ్‌పీ) ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య అందుతోందంటే అది వైఎస్‌ జగన్‌ చలువే. పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు కార్పొరేట్‌కు దీటుగా ఆధునిక వసతులతో తీర్చిదిద్దిన పాఠశాలల్లో అత్యాధునిక సదుపాయాలు నేడు ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయి. గతంలో పాఠశాలల్లో టీవీ ఏర్పాటు చేయడమే గొప్పగా చెప్పుకున్న పరిస్థితుల్లో వందలాదిగా ఐఎఫ్‌పీలను ఏర్పాటు చేసి, సర్కారు బడుల్లో టెక్నాలజీ విద్యను పేద వర్గాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌కే సొంతం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చి సబ్జెక్టు పరమైన విజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో తీర్చిదిద్ది, విద్యార్థులతో కళకళలాడే విధంగా చేసిన ఎన్నో గొప్ప పనులు ఘన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా మిగిలాయి. నేటి కూటమి ప్రభుత్వం వరుసగా వాటన్నిటికి మంగళం పాడుతూ ప్రభుత్వ విద్యావ్యవస్థను తిరోగమనం వైపు నడిపిస్తోంది.

గత ప్రభుత్వంలో ఇంజినీరింగ్‌ కోర్సులకు ఆంక్షలు లేనివిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజు రీయిబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో బీటెక్‌, ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేశాయి. ఫలితంగా ఇటు ఉద్యోగాల్లో చేరే వీలు లేక, అటు ఉన్నత విద్యవైపు వెళ్లేందుకు అవకాశం లేకుండా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

– బందెల నాసర్‌జీ, ఏఐఎస్‌ఎఫ్‌

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు

ఉన్నత చదువులకు ప్రోత్సాహం

వైఎస్‌ జగన్‌ పాలనలో విద్యాదీవెన, వసతి దీవెనతో ఉన్నత చదువులకు ఆంక్షలు లేని విధంగా ఫీజులను చెల్లించారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ తదితర కోర్సులకు గత 2019కు ముందు టీడీపీ ప్రభుత్వం షరతులతో అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంక్షలు ఎత్తివేశారు. ఈ విధంగా గుంటూరు జిల్లాలో 2019–20 విద్యాసంవత్సరం నుంచి 2022–23 విద్యాసంవత్సరం వరకు 36,962 మంది విద్యార్థుల చదువులకు గత ప్రభుత్వం రూ.625.55 కోట్లు చెల్లించింది. జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా గతంలో 42 మంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం రూ.3.68 కోట్లు చెల్లించారు.

2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చెల్లింపులకు నోచుకోలేదు. అదే విధంగా విదేశీ చదువులకు సైతం ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.

ప్రభుత్వ పాఠశాలలను బడుగు, బలహీనవర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థుల దరికి చేర్చడంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విశేష కృషి చేశారు. నాడు – నేడు మొదటి విడతలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 1,183 పాఠశాలలను రూ.283 కోట్ల వ్యయంతో ఆధునికీకరించారు. జిల్లాల పునర్విభజన అనంతరం రెండో దశలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 563 స్కూళ్లలో రూ.202 కోట్లతో పనులు మంజూరు చేశారు. వీటిలో దాదాపు 50 శాతానికి పైగా పనులు పూర్తవగా, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిగిలిన పనులు పూర్తి కాలేదు.

నాడు–నేడుతో

చదువుల విప్లవం

నాడు ‘స్మార్ట్‌’ బోధన..

నేడు వేదన

ఫీజులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు

గత వైఎస్సార్‌ సీపీ పాలనలో గుంటూరు జిల్లాలోని 175 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 624 ఐఎఫ్‌పీల ద్వారా విద్యార్థులకు ఆధునిక విద్య అందించారు. ప్రతి క్లాస్‌రూమ్‌కు ఒకటి చొప్పున ఒక్కో పాఠశాలకు ఐదు నుంచి 10 వరకు ఐఎఫ్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేశారు. రూ.1.26 లక్షల వ్యయం కలిగిన అత్యాధునిక ఐఎఫ్‌పీలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పాఠశాలల్లో ఏర్పాటు చేసింది.

నేటి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొన్ని పాఠశాలల్లో నిర్వహణ సరిగా లేక అవి మూలన పడ్డాయి.

విద్యార్థులకు ఆండ్రాయిడ్‌ ట్యాబ్‌లు

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8వ చదువుతున్న విద్యార్థులకు గత ప్రభుత్వం వరుసగా రెండేళ్ల పాటు 24,608 ఆండ్రాయిడ్‌ ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేసింది.

నేటి కూటమి ప్రభుత్వం వాటి ఊసే ఎత్తడం లేదు.

● గత ప్రభుత్వంలో వరుసగా నాలుగేళ్లు నిరాటంకంగా అమ్మఒడి అ1
1/3

● గత ప్రభుత్వంలో వరుసగా నాలుగేళ్లు నిరాటంకంగా అమ్మఒడి అ

● గత ప్రభుత్వంలో వరుసగా నాలుగేళ్లు నిరాటంకంగా అమ్మఒడి అ2
2/3

● గత ప్రభుత్వంలో వరుసగా నాలుగేళ్లు నిరాటంకంగా అమ్మఒడి అ

● గత ప్రభుత్వంలో వరుసగా నాలుగేళ్లు నిరాటంకంగా అమ్మఒడి అ3
3/3

● గత ప్రభుత్వంలో వరుసగా నాలుగేళ్లు నిరాటంకంగా అమ్మఒడి అ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement